•రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ గా నిలిచిన ఏకైక హీరో!
•ముఖ్యమంత్రిగా ఆంధ్రులకు ఎనలేని సేవలందించిన మహా నేత ఎన్టీఆర్!
పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెట్ వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు. ఆ వ్యాన్ కి అప్పట్లో సూపర్ క్రేజ్ ఉండేది. ఆయన దాన్ని "చైతన్యరథం" అని అనేవారు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తిగా నిలిచింది.అలా ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు. ఆ చైతన్యరథమే ప్రచార వేదికగా, ఆయన నివాసంగా మారిపోయింది. ఎన్టీఆర్ ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసి ప్రచార ప్రభంజనం సృష్టించి సీఎం గా ప్రజలని చక్కగా పాలించిన రియల్ హీరోగా ఎన్టీఆర్ తెలుగు జాతి గుండెల్లో చిరకాలం పాటు నిలిచిపోయారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.