* 40 ఏళ్ల సినీ ప్రయాణంలో విలక్షణ నటిగా గుర్తింపు
*రాజకీయ అరంగ్రేటంతో సంచలనం సృష్టించిన విజయశాంతి
*25 ఏళ్ల రాజకీయ అనుభవం ఎన్నో పాఠాలు నేర్పిందిగా
సినీ రంగంలో విజయశాంతి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.టాలీవుడ్ లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి స్టార్ హీరోలను సైతం డామినేట్ చేసేవిధంగా అనూహ్య స్టార్ డం అందుకొని హీరోయిన్ పాత్రల స్థాయిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత విజయశాంతి కే సొంతం.40 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ నటన ,విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విజయశాంతి ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.తెలంగాణ పోరాటంలో ఆమె స్థానం ఎంతో ప్రత్యేకం.పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు సాకారమవ్వడంలో ఆమె విశేష కృషి చేసారు.1998 లో రాజకీయ అరంగ్రేటం చేసిన విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరారు.విజయశాంతి బీజేపీ లో చేరడంతోనే ఆ పార్టీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1999 లో బీజేపీ విజయానికి రాములమ్మ ఎంతగానో కృషి చేసారు.బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా ఆమె చేసిన ప్రసంగాలు ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి ఎంతగానో ఉత్సాహాన్ని తెప్పించింది.అప్పట్లో ఆమె రాజకీయాలకి కొత్త కావడం ,లేడీ అమితాబ్ గా మంచి గుర్తింపు వుండడటంతో నెల్లూరులో ఆమె పాల్గొన్న సభ విజయవంతం అయింది.దీనితో బీజేపీలో ఆశలు రేగాయి .