ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... ప్రతికార రాజకీయాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీ అన్నట్లుగా ఏపీ రాజకీయాలు... హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా... వైసిపి పాలనలో... టిడిపి నాయకులను ఇబ్బంది పెట్టిన... నేతలను చంద్రబాబు టీం టార్గెట్ చేస్తోంది. ఇందులో మొదటగా... పుంగనూరు టైగర్.. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబాన్ని ఫోకస్ చేసింది టిడిపి.


గతంలో... చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాన రచ్చ చేశారు. అక్కడ ఉన్న టిడిపి లీడర్లు అందరినీ... చేర్పించుకున్నారు. అంతేకాకుండా కుప్ప మున్సిపాలిటీని కూడా... వైసిపి కైవసం చేసుకోవడం వెనుక పెద్దిరెడ్డి... కృషి ఉంది. కుప్పం గడ్డపై వైసీపీ జెండా ఎగురవేసేందుకు..  పెద్దిరెడ్డి అనేక దౌర్జన్యాలకు పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడును... కుప్పంలో అడుగుపెట్టకుండా కూడా వైసిపి..ప్రయత్నించింది.


అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... సీన్ రివర్స్ అయింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని.. పుంగనూరులో అడుగుపెట్టకుండా చంద్రబాబు.. భారీ స్కెచ్ వేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా పుంగనూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లను కూడా.. టిడిపిలో చేర్పించుకున్నారు. వైసీపీలో ఉన్న కీలక నేతలందరూ కూడా తాజాగా టిడిపిలో చేరిపోయారు. పుంగనూరు మున్సిపాలిటీ ఛైర్మన్‌ తో పాటు 13 కౌన్సిలర్లు టీడీపీ పార్టీలో చేరారు. అటు పెద్దిరెడ్డి అలాగే మిథున్ రెడ్డి... పుంగనూరులో అడుగుపెట్టకుండా.. టిడిపి కూడా హింసకాండ కు తెరలేపుతోంది.


ఇలా వైసీపీ పార్టీ పాలనలో... కుప్పంలో టిడిపికి చుక్కలు చూపిస్తే... ఇప్పుడు పుంగనూరులో... వైసిపికి టిడిపి చుక్కలు చూపిస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గాలలో కూడా టిడిపి... నాన్న రచ్చ చేస్తోంది. అంతేకాదు... ఏపీలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో పగా వేయాలని టీడీపీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: