• జగన్.. ఈగో పక్కన పెట్టి జనాల్లోకి రావాల్సిందే!

• జగన్.. ఇప్పటికైనా మేల్కొని తన తప్పు తెలుసుకోవాల్సిందే!

• జగన్.. తప్పులు తెలుసుకొని పాజిటివిటి పెంచువాల్సిందే!  


అమరావతి - ఇండియా హెరాల్డ్: 2019లో ఏకంగా 151 సీట్లతో రికార్డ్ సృష్టించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. 2024కు మాత్రం 11కు పడిపోయి చెత్త రికార్డ్ సృష్టించింది. కనీసం పది శాతం సీట్లు కూడా వైసీపీ సంపాదించుకోలేకపోయింది అంటే.. జగన్ ఇప్పటికైనా తన తప్పులని తెలుసుకొని తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉంది. ముందుగా తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే జగన్ బయటకి రావాలి. ఓడించిన జనాలకి క్షమాపణలు చెప్పుకోవాలి. ప్రాయశ్చితం కోసం ప్రయత్నం చెయ్యాలి. మంచి పనులు చేస్తూ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ లాగా పాజిటివ్ వైబ్స్ తెచ్చుకోవాలి. అంతే కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఉన్నట్లు ఉంటాను అంటే.. అదే అహంకారం చూపిస్తాను అంటే.. పార్టీతో పాటు జగన్ అడ్రస్ కూడా గల్లంతవుతుంది. ఇక మళ్ళీ ఓట్ల కోసం జనాల్లోకి రావాలన్నా జగన్ రాలేడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ రానివ్వరు కూడా. ఐతే ఈ పరిస్థితికి కేవలం జగన్‌ తప్పులే కారణం కాదు.తన చుట్టూ ఉన్న మొసళ్ళ లాంటి బూతు నేతలు కూడా ప్రధాన కారణమే.


ఆ మొసళ్ళని తన చుట్టూ చేర్చుకున్న జగన్‌.. అవే తనని కాపాడతాయని అనుకున్న జగన్ చివరికి వాటికే బలయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ లో ఒక డైలాగ్ ఉంటుంది. షాయాజీ షిండేతో మహేష్ బాబు ఒక డైలాగ్ అంటాడు. షాయాజీ షిండేని ఒక సందర్బంలో తిడుతూ "కూడా ఇలాంటోళ్ళని పెట్టుకొనే నాశనం అయ్యావ్" అంటాడు. ఆ డైలాగ్ ఇప్పుడు జగన్ కి సరిగ్గా సెట్ అవుతుంది. జగన్ ఆ మొసళ్ళని ఇంకా నమ్మితే జగనే కాదు తాను ప్రేమతో వాళ్ళ తండ్రి అయిన జనం మెచ్చిన నేతయిన ఓటమి ఎరుగని మాజీ దివంగత సీఎం అయిన రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో పెట్టుకున్న పార్టీ కూడా పూర్తిగా బలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మేల్కొని.. బయటకి వచ్చి జనాలని కలిసి పాజిటివిటీ పెంచుకొని అసలు తప్పు ఎక్కడ జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో.. తెలుసుకొని ఆ తప్పుని పునరావృతం కాకుండా వాటికి తప్పనిసరిగా చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి జగన్ మున్ముందు ఏం చేస్తాడో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: