* ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
* ప్రజలకు మేలు చేసే అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్!
* అధికారంలోకి రాగానే వీలైనన్ని హామీలను అమలు చేసిన రేవంత్!
హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వల్ల మంచి ప్రజాదరణ పొందుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేతగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలతో పాటు.. ప్రజలకు మేలు చేసే అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ..సంక్షేమ పాలన అందించే దిశగా సాగుతున్నారు. అధికారంలోకి రాగానే గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని హామీల అమలుపై సంతకం చేసి తాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వీలైనన్ని హామీలను అమలు చేశారు. అయితే మధ్యలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్నింటి అమలుకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియడంతో మిగతా హామీల అమలకు చర్యలు ప్రారంభించారు రేవంత్ రెడ్డి. తాజాగా కీలకమైన రెండు నిర్ణయాలు తీసుకున్నారు.