![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/do-you-know-the-logic-of-chandrababu-with-white-papers570cee79-c55f-463e-84d6-febe3d0f4bee-415x250.jpg)
ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం కూడా.. ఏడు కీలక శాఖలకు చెందిన అంశాలపై గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. ఇతర అంశాలతో కూడిన శ్వేత పత్రాలను విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. దీనిని ఇప్పట్లో కట్టడం సాధ్యం కాదని తేల్చేశారు. దీనిని వైసీపీ నాశనం చేసిందన్నారు. అంతేకాదు.. రివర్స్ టెండర్ల ద్వారా.. వ్యయాన్ని పెంచేశారని.. కేంద్రాన్ని కూడా లెక్కచేయలేదన్నారు.
ఇవి పైకి చెప్పుకొనేందుకు బాగానే ఉంటుంది. కానీ.. చంద్రబాబు వచ్చారు. పోలవరం పరుగులు పెడు తుందని ఆశించిన ప్రజలను, పారిశ్రామిక వేత్తలను కూడా.. ఆలోచనలో పడేసింది. శ్వేత పత్రం వల్ల వచ్చిన మైలేజీ కంటేకూడా.. ఇప్పుడు బాబుకు.. ఇబ్బందులు పెరిగాయి. ఇదిలావుంటే.. మరోవైపు.. అమరావతిపైనా శ్వేత పత్రం విడుదల చేస్తున్నారు. ఇక్కడ ధ్వంసం జరిగిందని చెప్పనున్నారు. అయితే.. ఈ విషయంలో కొంత సంయమనం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే.. ఇప్పుడిప్పుడే.. చంద్రబాబు ను చూసి పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కనుక అమరావతి లోటుపాట్లను పూసగుచ్చినట్టు వివరిస్తే.. పెట్టుబడి దారులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. తెలంగాణలోనూ ఇదే జరిగింది. అక్కడ ఆర్థిక శాఖకు చెందిన శ్వేత పత్రాన్ని విడుదల చేసిన తర్వాత.. అప్పటి వరకు రెడీగా ఉన్న పెట్టుబడి దారులు.. వెనక్కి వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని కొందరు మంత్రులు కూడా.. నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో తర్వాత కాలంలో శ్వేత పత్రాల విషయాన్ని పక్కన పెట్టారు. సో.. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.