ఇక విజయనగరం జడ్పీ చైర్మన్గా బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే గత 15 సంవత్సరాలుగా విజయనగరం జిల్లా రాజకీయాలను బొత్స ఫ్యామిలీ పూర్తిగా శాసిస్తూ వచ్చింది. గత ఐదేళ్లలో అయితే వారికి అస్సలు తిరుగులేదు. అయితే ఈ ఎన్నికలకు ముందు బొత్సకు ఆరోగ్యం అంతగా సహకరించలేదు. ఎన్నికల్లో తన పోటీ చేయనని.. తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కూడా బొత్స జగన్ను వేడుకున్నా జగన్ కనికరించలేదు. ఈ ఎన్నికలలో పోటీ చేయాలనే చెప్పడంతో పాటు బొత్సకు ఇష్టం లేకపోయినా భార్య ఝాన్సీని సైతం విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయించారు. దీంతో బొత్స అటు చీపురుపల్లిలోనూ.. ఇటు విశాఖపట్నం పార్లమెంటులోను.. రెండు చోట్ల సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు.
చీపురుపల్లిలో గట్టి పోటీ ఇచ్చి.. కళా వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఇక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బొత్స క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బొత్సతో పాటు ఆయన భార్య ఝాన్సీ కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో లేరు. ఇదిలా ఉంటే అనూహ్యంగా బొత్స సోదరుడు గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య కూడా ఇకపై రాజకీయాల్లో పోటీ చేయకూడదని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో కంటిన్యూ కాలేమన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ పొలిటికల్ ఆశలు ఉన్నవారిలో బొత్స మేనల్లుడు చిన్న శ్రీను తెరమీదకి రానున్నారు. అలాగే నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కూడా రాజకీయంగా కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఏది ఏమైనా బొత్స ఫ్యామిలీ రాజకీయాలకు దాదాపు గుడ్ బై చెప్పేసినట్టు.. విజయనగరం జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది.