ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నటువంటి కవిత  గత కొన్ని నెలలుగా జైల్లో మగ్గుతోంది. కనీసం ఆమెకు బెయిల్ కూడా దొరకడం లేదు. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కూడా కోల్పోయింది. దీంతో కవిత ఇక బయటకు రాదని చాలామంది భావించారు. ఇదే తరుణంలో కవితని ఎలాగైనా బయటకు తీసుకువచ్చేందుకు అనేక ప్లానింగ్స్ కూడా చేస్తున్నారు. మరి దానికోసం కేటీఆర్, కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనే వివరాలు చూద్దాం..లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి కవిత విడుదల తేదీని తాజాగా కేటీఆర్ ప్రకటించారు. కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ వస్తోంది.

 ఇదే తరుణంలో ఆమె విడుదలపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు కల్వకుంట్ల తారక రామారావు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కవిత మన ముందు ఉంటుందని  హామీ ఇచ్చారు. జగిత్యాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఎవరు కూడా అధైర్య పడొద్దు కవిత తప్పనిసరిగా జైలు నుంచి బయటకు వస్తుంది. స్థానిక సంస్థలు ఎన్నికల సమయంలో మీకు సపోర్టుగా నిలుస్తుంది. కవిత విడుదల కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోందని, ప్రచారం జరుగుతున్న సమయంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అంతేకాకుండా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కూడా సంచలన కామెంట్స్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, బండగట్టుకొని బావిలో దూకాడని ఎద్దేవ చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపాలని, మీకోసం నేను గల్లి గల్లి తిరిగి ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే కవితక్క కూడా బయటకు వస్తుందని మీకు అండగా నిలుస్తుందని తెలియజేశారు.  తారక రామారావు చేసినటువంటి కామెంట్స్ వార్తల్లో హైలెట్ గా నిలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: