జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కిరాక్ ఆర్పీ ఆ తర్వాత పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టి బిజినెస్ లోకి ఎంట్రి ఇచ్చి మరింత పాపులారిటీ అందుకున్నారు. అయితే మొదట కిరాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సెంటర్ ను ఓపెన్ చేయడానికి వైసిపి మహిళా నేత నటి రోజా ను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ నేత రోజా పైన చేసిన వ్యాఖ్యలను చూసి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి ఎగైనెస్ట్ గా మాట్లాడడమే అందుకు కారణం అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఎలక్షన్ ముందు నుంచి రోజా అని టార్గెట్ చేస్తూ చాలామంది ఓవర్ గా మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని అందులో రోజా కూడా మరింత దారుణంగా ఓడిపోతుందని కిరాక్ ఆర్పి చేసినటువంటి కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. అనుకున్నట్టుగానే వైసిపి పార్టీ 2024 లో ఓడిపోయింది.. అయినా కూడా కిరాక్ ఆర్పి రోజా అని అసలు వదలడం లేదు.. తిరుపతి వెంకన్న స్వామి తో పెట్టుకుని వైసీపీ పార్టీ ఓడిపోయింది అని కూటమి ప్రభుత్వమే గెలిచింది అంటూ ఎద్దేవ చేశారు కిరాక్ ఆర్పి.


ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మినిస్టర్ అయ్యాక పర్యటకశాఖ మంత్రిగా  బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆమె మూడు వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించిందని తన దగ్గర అందుకు సంబంధించి ఫ్రూప్స్ కూడా ఉన్నాయంటూ దమ్ముంటే వీటి పైన రోజా చర్చకు రావాలి అంటూ కిరాక్ ఆర్పి సవాల్ విసిరారు.. రోజా మాత్రమే కాదు జగన్ ప్రభుత్వంలో ఉండే మంత్రులలో అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని తదితర మంత్రులు కూడా వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారంటూ కిరాక్ ఆర్పి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: