![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/pawan-kalyan5622a45a-75ae-4824-8f71-f78ca5a6788e-415x250.jpg)
అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. దీంతో.. డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే.. పిఠాపురం ఎమ్మెల్యేగా తనను గెలిపించుకున్న నేపథ్యంలో... ఆ నియోజకవర్గ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు పవన్ కళ్యాణ్. తాను శాశ్వతంగా పిఠాపురంలో ఉండేందుకు... ఇల్లు కూడా కట్టుకుంటానని... ఇటీవల ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఇందులో భాగంగానే... తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో ల్యాండ్ కూడా కొనుగోలు చేశాడు. తన స్థలంలో ఇల్లు కూడా కట్టుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం 3.52 ఎకరాలు కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్. ఇందులో పిఠాపురం మండలంలోని భోగాపురం అలాగే ఇల్లేంద్రడా రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు కొనుగోలు చేశారు.
అయితే రెండు ఎకరాల్లో... జనసేన పార్టీ క్యాంప్ ఆఫీస్ కట్టుకొని ఉన్నాడట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మిగిలిన స్థలంలో.. తన ఇంటిని నిర్మించుకోనున్నారట. ఇక ప్రస్తుతం... పిఠాపురం నియోజకవర్గంలో ఎకరం మార్కెట్ విలువ 15 నుంచి 16 లక్షల వరకు ఉంది. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసింది కూడా ఇదే ధర. పిఠాపురంలో ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత అన్నా తో అక్కడే ఉండనున్నాడట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మరో 10 ఎకరాల తోటలు జనసేన నేతలు కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారట.