ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిని కూటమి ప్రభుత్వం బయట పెడుతూ వస్తోంది. పలు రంగాలలో తీవ్రమైన అవినీతి చోటు చేసుకుం దని .. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని .. కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు అందరూ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్కో శాఖలో ... ఒక్కో రంగంలో జరిగిన అవినీతిని ప్రజాధనం ఎలా ? దోపిడీ అయిందో బయట పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ భారీ అవినీతిని కూటమి నేతలు బయటపెడుతున్నారు. పులివెందులలో అవినాష్ రెడ్డి బావ వైసీపీ లీడర్ వెంచర్ వేసి బిల్డింగ్ క‌డుతున్నాడట.. అది కూడా ఎకరం ఉన్నర స్థలంలో ఉందట.


గట్టిగా అయితే ఆ స్థలం విలువతో పాటు వేసిన పిల్లర్లు ... స్లాబ్ ఖర్చు కలిపి రెండు కోట్లు లోపు మాత్రమే ఉంటుందట. అసలు ఆ ఏరియాలో కొనేవాళ్ళు లేరు సరి కదా అద్దెకు వచ్చే వాళ్ళు కూడా ఉండరట. ఆ విషయం అందరికీ తెలిసిందే .. అయితే మన ప్రభుత్వం ఉంది కదా ? అని ఇక్కడే అసలు కథ నడిపించేశారు. వెంటనే కలెక్టర్ పులివెందులలో అద్భుతమైన ఫోర్ స్టార్ హోటల్ కట్టాలని నిర్ణయించుకున్నారు. సగం కట్టిన ఆ భవనం రెండున్నర ఎకరాల్లో ఉందని .. కొనేయాలని టూరిజం డిపార్ట్మెంట్ కు రిక్వెస్ట్ పెట్టారు. వెంటనే కొనేయాలని సీఎంఓ నుంచి ఒతిడులు కూడా వచ్చాయి. టూరిజం అధికారులు ఆ సగం కూడా పూర్తికాని భవనానికి ఆ స్థలానికి కలిపి ఏకంగా 12.50 కోట్లు ఇచ్చి కొనేశారు.


ఈ దెబ్బతో పది కోట్లకు పైగా ప్రజాధనం అవినాష్ రెడ్డి భావ ఖాతాలో పడిపోయింది. విచిత్రం ఏంటంటే ఆ భవనం కొనే టైం లో ఆ స్థలాన్ని కొలిస్తే కేవలం ఎకరం న్న‌ర‌ మాత్రమే వచ్చింది. కానీ రెండున్నర ఎకరాలు అని ముందుగా కలెక్టర్ చెప్పారు. చివరకు ఎకరం నర స్థలంలో మాత్రమే ఉన్న ఆ భవనానికి 12.50 కోట్లు ఇచ్చి కొనేశారు. ఏది ఏమైనా ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దోచుకున్నారో తెలుస్తోంది. ఇలాంటి దారుణాలు బయటపడకుండా ఇంకెన్ని ఉన్నాయో అన్న అనుమానాలు ప్రజల వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూటమి నేతలు మాత్రం వైసిపి పాల‌న‌లో జరిగిన ప్రతి ఒక్క అవినీతిని బయట పెట్టే వరకు నిద్రపోయేలా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: