![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/is-raghurama-right-for-this-position-has-babu-fixed-itedae5379-8aca-4881-b63b-0617801444aa-415x250.jpg)
చివరకు ఈ ఎన్నికలకు ముందు రఘురామ బీజేపీ లోకి వెళతారా ? లేదా ఏ పార్టీలోకి వెళతారు ? అన్న సస్పెన్స్కు తెరదించుతూ టీడీపీలో చేరారు. అది కూడా నరసాపురం ఎంపీగా కాకుండా టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచారు. ఐదేళ్ల పాటు జగన్ పై ఆయన చేసిన పోరాటం నేపథ్యంతో ఆయనకు చంద్రబాబు కేబినెట్లో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనుకున్నారు. బాబు కేబినెట్లో పదవి రాలేదు.. అయితే బాబు ఒక మంత్రి పదవిని మాత్రం అలా ఖాళీగానే ఉంచారు. రఘురామకు స్పీకర్ వస్తుందనుకున్నా రాలేదు.
ఇప్పుడు స్పీకర్ పదవి రాలేదు.. అది అయ్యన్న పాత్రుడికి ఇచ్చారు. అయితే ఇప్పుడు రఘురామ కు మంత్రి పదవి లేదా విప్ పదవులలో ఏదో ఒక పదవి వస్తుందని కూటమి ప్రభుత్వ వర్గాలు చర్చించు కుంటున్నాయి. ఒక వేళ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే క్షత్రియ సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో ఎవ్వరూ లేరు. క్షత్రియ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే రఘురామకే వస్తుందని లేని పక్షంలో విప్ పదవి అయినా ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారని టాక్ ?