*ఎన్టీఆర్ తరువాత అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడు వైఎస్ఆర్
* ఉమ్మడి రాష్ట్రంలో మెగా డీఎస్సి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దే ..
దివంగత నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్టీఆర్ తరువాత అంతటి స్థాయి ప్రజాదరణ పొందిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. 1978 లో తొలి సారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాజశేఖరరెడ్డి ఆ తరువాత 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యే గా ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.ఇలా ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు.అయితే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారి కష్టాలను తెలుసుకోవడానికి 2004 ఎన్నికల ముందు ఏకంగా 1460 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు.నేను విన్నాను నేను వున్నాను అనే నినాదంతో ముందుకు సాగిన రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలలో అద్భుత విజయం సాధించారు.ఎన్నికల ప్రచారంలో ప్రజల కష్టాలను తీర్చేందుకు ,ఉచిత కరెంటు ,ఫీజు రియంబర్స్మెంట్ ,రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి ఎన్నో పధకాలను ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు.కానీ అప్పటికి కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు.తాను ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చే భాద్యత నాది అని రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు