* 2003 చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం
* రైతుల సమస్యలే లక్ష్యంగా పాదయాత్ర చేసిన వైయస్సార్
* పాదయాత్ర దెబ్బకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక
* వైయస్సార్ బాటలోనే జగన్ పాదయాత్ర చేసి సక్సెస్
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి... కెరీర్ మొత్తాన్ని మార్చేసింది ఒకే ఒక పాదయాత్ర. అది 2003 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఆ ఒక్క పాదయాత్ర దెబ్బకు ఆయన కెరీర్... అమాంతం పెరగడమే కాకుండా రెండుసార్లు వరుసగా... ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2003 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
పాదయాత్రలో... రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, కనీస మద్దతు ధర లాంటి అనేక హామీలు ఇచ్చి 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఇక ఎన్నికల కంటే ముందు చెప్పిన విధంగానే... అన్ని హామీలను అమలుపరిచారు. దీంతో 2009 సంవత్సరంలో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మహాకూటమి ఏర్పడ్డా కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి సింగిల్ హ్యాండ్ తో కాంగ్రెస్ను గెలిపించారు. ఆ తర్వాత పాదయాత్ర రెండు తెలుగు రాష్ట్రాలలో... చాలా కామన్ అయిపోయింది. అందరు లీడర్లు పాదయాత్రను నమ్ముకొని చాలా సక్సెస్ కూడా అయ్యారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో 2019 ఎన్నికల్లో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.