ఉచిత విద్యుత్, గ్రామీణ ఆరోగ్య భీమా, ఉచిత అంబులెన్స్ సేవ, గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీ గృహాలు, సబ్సిడీ బియ్యం, వెనకబడిన వారికి కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్, రైతులందరి కోసం జలయజ్ఞం ప్రాజెక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాలనలో పేదలు, రైతుల కోసం తీసుకొచ్చిన సంస్కరణలు అన్ని ఇన్ని కావు. ఈ సంస్కరణల్ని సరికొత్త చరిత్రకు నాంది పలికాయి. అయితే నేడు వైయస్సార్ 75వ జయంతి. దీంతో తెలుగు ప్రజలందరూ కూడా మరోసారి గుండెల్లో గుడి కట్టుకున్న ఆ దేవుడిని స్మరించుకుంటున్నారు. 2009 సెప్టెంబర్ రెండవ తేదీన ఇక వైయస్సార్ హెలికాప్టర్ పేలిన ఒక గుండెలు పిండేసే ఘటనని కూడా గుర్తు చేసుకుంటున్నారు.
ఇలా జననేతగా జనం హృదయంలో గుడి కట్టుకున్న రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్న వైయస్సార్ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతము షర్మిల, జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వారి రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. ఒకప్పుడు వైసీపీ పార్టీ గెలుపు కోసం షర్మిల, జగన్ పనిచేసినప్పటికీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో జగన్ వైసీపీలో ఉంటూ శత్రువులుగా మారిపోయారు. దీంతో పెద్దాయన బ్రతికుంటే ఇదంతా జరిగేది కాదని ఎంతోమంది వైయస్ కుటుంబ అభిమానులు అనుకుంటున్నారు.