ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మహానేత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా అభిమానులు కార్యకర్తలు సైతం ఈ వేడుకను చాలా  గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంతోమంది ప్రజలు రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు వల్ల లబ్ధి పొందిన వారు కూడా ఉన్నారు.. అందుకే రాజశేఖర్ రెడ్డి మరణించిన కూడా ఇప్పటికీ ఆయన పేరు వినగానే ఎలాంటి వారి కళ్ళల్లో అయినా సరే ఆనందం కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన కుమారుడు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాగోద్వేగానికి గురై ఒక ఎమోషనల్ ట్వీట్ని షేర్ చేశారు.


ముఖ్యంగా తన తండ్రి 75వ పుట్టినరోజు సందర్భంగా "ఈరోజు మా అందరికీ పండుగ రోజు.. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా రోజు వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు మీ పుట్టినరోజులు సైతం ఎన్నో రకాల సేవ కార్యక్రమాలతో ముందుకు తీసుకు వెళుతున్నారని ప్రజా శ్రేయస్సు కోసమే మీరు చూపించిన మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు జగన్. రాజకీయాలలో మీరు చూపిన ధైర్య సాహసాలే మాకు మార్గము అంటూ తెలిపారు.


ఆశయాల సాధన లక్ష్యంగా కోట్లాది కుటుంబాలు క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి మీరే అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి అప్పటినుంచి ఇప్పటివరకు పోరాటాలు చేస్తూ 2019లో భారీ విజయాన్ని అందుకున్నారు.మళ్ళీ 2024లో ఘోరమైన ఓటమిని చూసిన తర్వాత కూడా తను ఎవ్వరికీ భయపడేది లేదని కచ్చితంగా ప్రజల మద్దతు తమకే ఉందని రాబోయే రోజుల్లో మరింత పొలిటికల్ పరంగా ఎదుగుతామని కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: