గతంలో ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఆమె మాట్లాడే వారు కానీ రీసెంట్ గా ఆమె మాట తీరులో చాలా మార్పు కనిపిస్తోంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రోజా వ్యవహరించిన తీరులో మునుపటి ఫైర్ కొంచెం కూడా కనిపించలేదు. మాటల తీరు పూర్తిగా చేంజ్ అయింది. సొంత పార్టీ నేతలే రోజా మాట్లాడిన మాటలు విని ఆశ్చర్యపోతున్నారట. రోజా ఎప్పుడూ లేనివిధంగా ఈరోజు చాలా హుందాగా మాట్లాడారు. అందుకే ఆమెను సొంత పార్టీ నేతలు అభినందిస్తున్నారు. రోజా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ ఆ మహానేత పాలనను మెచ్చుకున్నారు, తండ్రి లాంటి పాలనే జగన్నూ అందించారని కామెంట్స్ చేశారు, అదే పాలన మళ్లీ తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు కామన్ అని అన్నారు.
ఓడిపోయామని నిరుత్సాహపడమని, అది బాధాకరమైనా, ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా వైసీపీ ప్రజల మంచి కోసమే పని చేస్తుందని పేర్కొన్నారు. రాజన్న పాలన అందించడం ఒక్క జగన్ కే సాధ్యమవుతుందని, ప్రజల కష్టాలు దూరమయ్యేలా అందరం కలసికట్టుగా పనిచేయాలని రోజా మాట్లాడారు. ఎప్పుడూ ఏదో ఒక విమర్శ చేసేవారు ఇప్పుడు మాత్రం చాలా పాజిటివ్ గా మాట్లాడటంతో అందరూ అవాక్కయ్యారు. మున్ముందు కూడా ఆమె ఇలాంటి షాక్లిస్తారేమో అని సరదాగా కొందరు కామెంట్లు చేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఇలా హుందాగా వ్యవహరించి ఉంటే ఇంకా బాగుండేది కదా అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.