అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం తాము ప్రకటించిన సూపర్ సిక్స్ పధకాల్లో భాగంగా ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం లాంటి పధకాలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే ఇటీవల పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేదవారికోసం నిత్యావసరల్లో భాగమైన కంది పప్పు, బియ్యం పంపిణి గూర్చి ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్, ఎండీ వీరపాండియన్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతు బజార్లలో విక్రయించే సరుకుల వివరాలను వెల్లడించారు. కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ. 181కి విక్రయిస్తుండగా..రైతు బజార్లలో 160కే విక్రయిస్తారు. స్టీమ్డ్ రైట్ రూ.49, బియ్యం రూ. 48కే విక్రయిస్తారు.ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు, బియ్యం ధరల స్థీరికరణకు ఆదేశాలు జారీ చేసింది. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 181కి, రైతు బజార్లలో రూ. 160కి విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 55.85కి , రైతు బజార్లలో రూ. 48కి అమ్మటానికి అనుమతి ఇచ్చినట్లు టీడీపీ పోస్ట్ చేసింది.మంత్రి ప్రకటించిన ఈ విధానంతో పేదరైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.