తెలంగాణ రాష్ట్రంలో... తమిళనాడు, మహారాష్ట్ర రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. కల్వకుంట్ల కవిత.. ఏక్ నాథ్ షిండే లాగా... మారబోతున్నారని కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత... బయటికి వచ్చిన తర్వాత వెంటనే పార్టీ పెడతారని కొంతమంది అంచనాలు వేస్తున్నారు. కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు... కల్వకుంట్ల చంద్రశేఖర రావు... సపోర్ట్ గా లేరని ఈ సమాచారం అందుతుంది.


ఆయన ఇప్పటివరకు కల్వకుంట్ల కవితను చూసేందుకు జైలుకు వెళ్లలేదని... ఆమె వర్గీయులు, కవిత భర్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. కేటీఆర్, హరీష్ రావు  ఇత గులాబీ నేతలు మాత్రమే కవితను కలిసేందుకు వెళ్లారు. ఇప్పటివరకు కేసీఆర్ గానీ, ఆయన భార్య... జైలుకు వెళ్లి కవితను పరామర్శించలేదు. దీంతో కల్వకుంట్ల కుటుంబం పై కవిత చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు.


ఇక ఆమె... మరో వారం రోజుల్లో బయటికి రానున్నారని ఈ సమాచారం. బయటికి వచ్చిన తర్వాత ఆమె కొత్త పార్టీ కూడా పెడతారని ప్రచారం జరుగుతోంది. జైలుకు వెళ్లి బయటకు వచ్చిన వారు వరుసగా రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన అంతకుముందుకు జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి.. కూడా కేసీఆర్ ప్రభుత్వంలో జైలుకు వెళ్లారు. మొన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్లడం జరిగింది.


అంతేకాకుండా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్... జైలుకు వెళ్లి బయటికి వచ్చాడు. మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సెంటిమెంట్ తనకు వర్క్ అవుట్ అవుతుందని... కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అవుతారని ఆమె భావిస్తున్నట్లు వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి... కెసిఆర్ అంటే పడని వారు ఈ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. కవితను పరామర్శించేందుకు కేసీఆర్ వెళ్లకున్నా... ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ విషయం బయటికి రాకుండా సీక్రెట్ గా మైంటైన్ చేస్తున్నావ్ కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: