ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మధ్య రగడ నడుస్తోంది. తాజాగా ఏపీ మంత్రి సత్య కుమార్ కేటీఆర్ పై సెటైర్లు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కోపానికి వచ్చినటువంటి కేటీఆర్, సత్యకుమార్ ఎక్స్ అకౌంట్ ను బ్లాక్ చేశారు.  ప్రస్తుతం ఈ మ్యాటర్ ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే తాజాగా  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఓడిపోయి ధర్మవరంలో కేతిరెడ్డి కూడా ఓటమి పాలు కావడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను  ఖండిస్తూ ఏపీ మంత్రి సత్య కుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీనిపై  స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్య కుమార్ ఈ విధంగా  స్పందిస్తూ మాటల యుద్ధం చేశారు. 

ఇంతకీ సత్య కుమార్ ఏమన్నారంటే.. ధర్మవరానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఓటమి చెందడంపై, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చిలక పలుకులు పలుకుతున్నారని,  ధరణి పేరుతో ఆయన తెలంగాణ రాష్ట్రంలో నడిపినటువంటి భూమా మాఫియా లాగానే, ధర్మవరంలో కూడా గుడ్ మార్నింగ్ అని చెబుతూ మీ మిత్రుడు అసైన్డ్ భూములు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడని అన్నారు. చివరికి కొండలు, చెరువులను కూడా విడిచిపెట్టలేదని, ఆయన గుడ్ మార్నింగ్ వెనక కరప్షన్, కలెక్షన్, కబ్జా, కమిషన్  ఉన్నాయన్నారు.  

ఫామ్ హౌస్ లో ఉండే మీరు ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని అడిగితే ధర్మవరం ప్రజలే నీకు సమాధానం ఇస్తారని చెప్పారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో నన్ను నాలుగు సంవత్సరాల క్రితం బ్లాక్ చేశారు.  మీ అహంకారం అవినీతి అసమర్థ పాలనే మిమ్మల్ని మీ యొక్క ప్రియ స్నేహితుడైన జగన్ ను కేతిరెడ్డిలను ఓడించాయి. ఈ విధంగా ఒకే జాతికి చెందిన పక్షులు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ  సత్య కుమార్ ట్విట్ చేయడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: