![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/chandrabbau-ap-peopules81bc63d1-0d2b-4f8c-9f50-3852990af001-415x250.jpg)
ఇప్పుడు తాజాగా ఎన్నికల హామీల భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కల్పిస్తామంటూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం పైన కసరత్తు చేస్తున్నారట.. ఈ హామీ పైన ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు బీమా సౌకర్యంతో వైద్య సేవలు అందించే విధంగా కూడా ప్రతిపాదనలు తీసుకువచ్చేలా ఆదేశాలను జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల వరకు బీమా సేవలను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందట.
ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల పరిమితికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిని పెంచింది.. కేంద్ర పరిమితితో కలుపుకొని రాష్ట్రంలో 25 లక్షల రూపాయల వరకు పరిమితి కల్పించాలి అంటూ ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది వీటి పైన మరో రెండు మూడు రోజులలో స్పష్టత వచ్చేలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి ఎందుకు సంబంధించి పూర్తి వివరాలు మరో కొద్ది రోజులలో తెలియబోతోంది. ప్రస్తుతం ఈ విషయమైతే ఏపీ ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు.