* కీలక మార్పుల దిశగా త్వరితగత అడుగులు
* విద్యతో పాటు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలలో టీడీపీ,బీజేపీ ,జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించిన వైసీపీ ప్రభుత్వం ఈ సారి కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.తిరుగులేని విజయం సాధించిన కూటమి ప్రభుత్వం తరుపున చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించారు.అయితే గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి పాలైన లోకేష్ పట్టు వీడని విక్రమార్కుడిలా మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఏకంగా 90 వేలకు పైగా మెజారిటీతో అద్భుత విజయం సాధించాడు.అంతే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సారి కూడా లోకేష్ కు ఐటీ మినిస్టర్ గా కేబినెట్ లో చోటు దక్కింది.అయితే ఈ సారి లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్య శాఖ కూడా రావడం విశేషం.తనని విద్యా శాఖ వద్దని చాలా మంది సూచించారని ఇటీవల లోకేష్ తెలిపారు.అయితే తాను విద్యా శాఖను ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లు లోకేష్ తెలిపారు