ముఖ్యంగా పిడుగురాళ్ల లో డయేరియా పై మంత్రి నారాయణ ఫోకస్ చేశారు. నిత్యం రివ్యూ చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు నారాయణ. పిడుగురాళ్ల లోని లెనిన్ నగర్,మారుతి నగర్ లో ఇప్పటి వరకూ 60 డయేరియా కేసులు నమోదయ్యాయని నారాయణ తెలిపారు. ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారన్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. కృష్ణా నది నుంచి మంచి నీరు అందించేందుకు 16 కి.మీ పైప్ లైన్ ఉందని... దీంతో పాటు పట్టణంలో 7 పవర్ బోర్స్, 36 హాండ్ బోర్స్ ఉన్నాయని వెల్లడించారు.
ఒక పవర్ బోర్ లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారని... కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజి ఉండటంతో ఐదు రోజులు పాటు నీటి సరఫరా నిలిపి వేశారని తెలిపారు. ఈ ఐదు రోజుల్లో బోరు నీటిని వాడారని.... కృష్ణా పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం తాగు నీరు ఇస్తున్నప్పటికీ ఇంకా కేసులు వస్తున్నాయని పేర్కొన్నారు. నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్ కు ఈరోజు శాంపిల్స్ పంపిస్తున్నామని... కొన్ని రిపోర్ట్ లు వస్తాయి...మరికొన్ని రిపోర్ట్ లు 48 గంటల్లో వస్తాయన్నారు. లెనిన్ నగర్,మారుతి నగర్ ప్రజలు నీళ్ళు కాచి తాగాలి..పట్టణంలో ఉన్న R0 ప్లాంట్స్ అన్నీ కూడా టెస్ట్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలా ప్రజల కోసం పని చేస్తూ.. ముందుకు వెళుతున్నారు.