ఏపీలో కూటమి ప్రభుత్వం మంచి దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితంగా ప్రజలకు చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అధికారంలోకి వచ్చి రాగానే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టింది.

అవును, సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల ముందు ప్రకటించిన ఐదు హామీల అమలుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం, వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, సామాజిక పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇక ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం చేసిన లోపభూయిష్టమైన నిర్ణయాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు కూడా. ఇక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ముప్పై రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలు ఇవే!

1. వృద్ధాప్య, వితంతు పింఛను రూ.4000కి పెంపు

2. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (16,347 టీచర్ పోస్టులు)  

3. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు (రూ.6000కి పెంపు)

4. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు

5. ఇంటి వద్దకే పింఛను

6. ఉచిత ఇసుక అమలు

7. గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు

8. 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం (ఆగస్టు 15 నుంచి)

9. ఎర్ర చందనంపై ఉక్కుపాదం

10. పోలవరం నిర్మాణం మరలా ప్రారంభం

11. రాజధాని అమరావతి పనులు ప్రారంభం

12. స్కిల్ డెవలప్ మెంట్ మరలా ప్రారంభం

13. పాసుపుస్తకాలపై రాజముద్ర ముద్రించడం

14. పిల్లలు అందరికీ తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల

15. అత్యాచారం చేసిన నిందితులను 48 గంటల్లోనే అరెస్ట్ చేయడం

16. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకి నీరు విడుదల

17. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనుల ఫినిషింగ్ టార్గెట్ 2026

18.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి

19. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయడం

20. ప్రభుత్వ ఉద్యోగులకు అందిన పెండింగ్ జీతాలు

21. రాజధానిలో XLRI విద్యా సంస్థ

22. ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్

23. పలాసకు సాగునీరు

24. పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు

25. ఒకే ఒక్క వాట్సప్ కాల్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు నారా లోకేష్ అండ

26. తెలంగాణతో విభజన సమస్యలను ఓ కొలిక్కి తేవడం

27. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు

28. విజయవాడ తూర్పు బైపాస్‌కి కేంద్రం ఆమోదం

29. నిత్యావసర ధరల నియంత్రణ (రైతు బజార్లలో తక్కువ రేట్లకే బియ్యం, కంది పప్పు)

30. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ప్రధాని, కేంద్ర మంత్రులకు రాష్ట్ర సమస్యలపై వినతి

మరింత సమాచారం తెలుసుకోండి: