ఏపీలో జరిగిన ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి అందరికీ తెలిసినదే. అయితే వైసీపీ ఓటమికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కుటుంబ కలహాలే ప్రధాన పాత్ర పోషించాయని వైసీపీ సీనియర్ నాయకులు కొందరు తమ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నట్టుగా సమాచారం. అవును... సొంత తల్లి, చెల్లెలే అన్నని నిండా ముంచేశారని జగన్ పైన జాలిపడుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. వైఎస్సార్ ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే క్యాడర్ ఈ విధంగా అన్యాయానికి గురైందని వాపోతున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, పేర్ని నాని అనే వ్యక్తి గురించి అందరికీ తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా వెలగబెట్టిన నానీ చుట్టూ అనేక రకాల వివాదాలు ఉన్నాయి. బూతు మాటలు మాట్లాడడంలో మంచి నేర్పరిగా పేరు తెచ్చుకున్న వారిలో నాని ఒకరు. అంటే కాదండోయ్... జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. ఆయన తాజాగా ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతూనే సీఎం ఓ ని సరిగ్గా నడపడంలో ఎమ్మెల్యేలకు అనుకూలంగా నడపడంలో మాత్రం జగన్ ఫెయిల్ అయ్యారని, అదేవిధంగా జగన్ కి తన సొంత కుటుంబ సభ్యులే అన్యాయం చేసారంటూ మూలిగారు.

ఈ క్రమంలోనే క్యాడర్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందని, వాలంటీర్లను పెట్టి ప్రజలకు మేలు చేశారు కానీ పార్టీలో గుర్తింపు కోరుకున్న కార్యకర్తలకు ఎలాంటి గౌరవం దక్కలేదని అన్నారు. దాంతో జగన్ కి ఈ విషయాలు తెలుసా? అని యాంకర్ ప్రశ్న వేయగా ఆ సంగతి తనకి తెలియదని, జగన్ అయితే కొత్త రకంగా పాలించాలని ప్రజలకు మేలు చేయాలని భావించి మోసపోయారని, ఈ క్రమంలో తమ పార్టీనే ఇబ్బంది పెట్టాయని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే విజయమ్మ, షర్మిల మీద కూడా ఆయన హాట్ కామెంట్స్ చేసారు. తల్లి, చెల్లెలు ఇద్దరూ వేరే పార్టీలోకి వెళ్లి తమని వెర్రివాళ్ళని చేసారని.. వారి ఫామిలీ గొడవల వలన లక్షలాది మంది క్యాడర్ ని బలి చేశారు అని పేర్ని నాని మండిపడ్డారు. ఆస్తి తగదాలు ఉంటే కోర్టులలో కేసులు వేసుకోవాలనీ రాజకీయాల్లో ఇలా చేయడం ఏ మాత్రం తగదని షర్మిల మీద కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇదే వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysp