ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కూటమి ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ అందించింది.. ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ఒక ముహూర్తాన్ని సైతం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉండే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగించబోతున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు అధికారికంగా రాష్ట్ర మంత్రి సత్యప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో మహిళలు సైతం కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇందుకు తగ్గ పూర్తి విషయాలను ఇంకా తెలియజేయడం లేదు.


ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు.. మరొకవైపు అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ముందుగా పెన్షన్లను పెంపు, ఉచిత ఇసుక విధానం,తల్లికి వందనం వంటి పథకాలను సైతం ప్రారంభించారు.ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందించడానికి సిద్ధమయ్యింది ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కర్ణాటక తెలంగాణలో ఈ పథకం పైన ఉన్నటువంటి విధివిధానాలను కూడా తెలుసుకున్నట్లు తెలుస్తోంది.



అలాగే ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు ప్రభుత్వం పైన ఎంతటి భారం పడుతుంది? ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని విషయాలపైన సుదీర్ఘ చర్చ జరిపినట్లు సమాచారం. మరి ఉచిత ప్రయాణానికి కావలసిన పత్రాలు ఏంటివి అనే విషయం తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు వేచి ఉండాల్సిందే.. ఇప్పటికే ఈ పథకాన్ని తెలంగాణ కర్ణాటక వంటి ప్రాంతాలలో సైతం అమలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పథకాన్ని అమలు చేయడం ఒక సవాల్గా కూడా మారింది. అయితే అమలు చేసిన ఈ పథకం పైన ఎలాంటి విమర్శలు వినిపిస్తాయనే ఆందోళన కూడా అటు కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈ పథకం వల్ల చాలామంది ఆటోల మీద ఆధారపడిన వారికి దెబ్బ పడేలా ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం చెప్పిన దిశగానే అడుగులు వేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: