* టాలీవుడ్ లో హీరోయిన్ గా, జడ్జిగా రాణింపు
*  రెండుసార్లు ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు
*  బూతుల మంత్రిగా గుర్తింపు
* అసెంబ్లీలో... రోజా సెంటర్ ఆఫ్ యాక్షన్  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది మహిళా రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అయ్యారు. ఇప్పటికీ కూడా రాజకీయాలలో సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఏపీ మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా ఒకరు. ఏపీ మాజీ మంత్రి, వైసిపి కీలక నేత రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజా పేరు చెప్పగానే... ఏదో తెలియని ఫీలింగ్ అందరికీ వస్తుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత..  పచ్చి బూతులు మాట్లాడే ఖాతాలోకి ఈమె వెళ్లిపోయింది.

 
వాస్తవానికి ఫైర్ బ్రాండ్ రోజా... తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ జీవితాన్ని  ప్రారంభించింది.అలాంటి రోజా మొదటగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా.. ఆ తర్వాత సాధారణ నటిగా కొనసాగారు. ముఖ్యంగా జబర్దస్త్ షోలో.. జడ్జిగా... కనిపించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించారు. అయితే.. తెలుగుదేశం పార్టీలో సక్సెస్ కాలేకపోయినా రోజా వైసిపి పార్టీలోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా...  ఒకసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

 
అలాంటి రోజా ఎప్పుడు... అచ్చ తెలుగు అమ్మాయిల చీర కడతారు. ఏదైనా సినిమా ఫంక్షన్ లేదా చిన్న చిన్న కార్యక్రమాలు జరిగితే.. కామన్ డ్రెస్సులు వేస్తారు. గతంలో హీరోయిన్గా ఉన్నప్పుడు ఆమె అందచందాలను చూపించారు కానీ... రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె సాంప్రదాయ బద్దంగానే కనిపిస్తున్నారు.  ఒక సాంప్రదాయ  మహిళ ఎలాగ ఉండాలో అచ్చం అలాగే కనిపిస్తారు రోజా.అయితే గెటప్ పరంగా రోజా పర్వాలేదనిపించినా గానీ.... ఆమె ప్రెస్ మీట్ పెడితే మాత్రం పచ్చి బూతులు వస్తాయి.


తెలుగుదేశం పార్టీ నేతలను, ఇటు పవన్ కళ్యాణ్ ను ఎన్నికల సమయంలో అంతకుముందు అత్యంత దారుణంగా తిట్టారు రోజా. దీంతో బూతుల మంత్రిగా కూడా రోజా మారిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీలో.. టిడిపి నేతలను ర్యాగింగ్ చేయడంలో మొదటి స్థానంలో ఉంటారు రోజా. అలాగే టిడిపి నేతలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ.. వైసిపిని టాప్ పొజిషన్లో నిలబెట్టారు రోజా. అయితే అలాంటి రోజా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం కామ్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: