ఆంధ్రప్రదేశ్లో ఈనెల 7వ తేదీన ముచ్చుమర్రి  గ్రామంలో మైనర్ బాలికను ముగ్గురు మైనర్ విద్యార్థులు అత్యాచారం చేసి చంపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పటికి కూడా ఆ బాలిక మృతి దేహాన్ని వెతుకుతున్న అది సాధ్యం కావడం లేదు. పది రోజులు అవుతున్న బాలిక డెడ్ బాడీ కి సంబంధించిన ఎలాంటి ఆచూకీ ఆనవాళ్లు కూడా కనిపించలేదట. కేవలం ముగ్గురు మైనర్లు నిందితులు కావడం చేత వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతోనే..SDRF, NDRF బృందాలు ఎన్నోసార్లు వెతికినా కూడా ఎక్కడ బాలిక ఆచూకీ లభించడం లేదు.



ముఖ్యంగా నిందితులు సైతం పొంతన లేని సమాచారం తెలియజేయడంతో వెతకడం చాలా కష్టంగా మారిపోయిందట పోలీసులకు. అయితే బాలిక మృతదేహాన్ని రాళ్లు కట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వేసినట్లుగా నిందితుల యొక్క తల్లితండ్రులు అనుమానిస్తున్నామంటూ తెలియజేశారు.. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఏ ప్రాంతంలో అనేది కూడా నిందితులు చాలా క్లారిటీగా చెప్పడం లేదు. నిందితులు ఒక్కొక్కసారి ఒక్కో సమాచారం ఇవ్వడం పైన వారికి మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఆ బాలిక యొక్క ఆచూకీ ఎలాగైనా చూపించాలంటూ హోం మంత్రి అనిత పోలీసు ఉన్నతాధికారులను కూడా ఆదేశించారు.



ముగ్గురు మైనర్లు బాలిక పైన అత్యాచారం చేసి మరి గొంతు నొక్కి ఆ తర్వాత చంపేశారని.. మృతదేహాన్ని కేసీ కెనాల్ లో పడేసారని చెప్పగా ఆ తర్వాత అక్కడ వెతికించగా మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్లో పడేసామని చెప్పగా అక్కడ కూడా వెతికించగా.. ఆ బాలిక యొక్క డెడ్ బాడీ దొరకడం లేదు. మొదట్లో స్మశాన వాటికలు బూడ్చమని చెప్పగా.. వెతికిన ఆనవాళ్లు దొరకడం లేదు. నిందితులపై గ్యాంగ్ రేప్ కేసు కింద నమోదు చేశామని తెలిపారు. ముఖ్యంగా ఆ బాలురు మొబైల్లో ఎక్కువగా పోర్న్ వీడియోలు చూసేవారని.. అలాగే యూట్యూబ్ వీడియోల వల్ల ఇలాంటి ఘాతుకానికి పాల్పడినట్టుగా పోలీసు అధికారులు తెలియజేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టుగా కూడా పోలీసులు తెలియజేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: