తెలంగాణ లేడీ పొలిటిషన్లలో క్వీన్ కొండా సురేఖ

• తప్పు చేసిన వారిని శిక్షించే అమాయకులను కాపాడే శక్తిగా ఆమె రూపం ఉంటుంది  

• ఆడ సింహంగా ఇప్పటికే పేరు

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు కొండా సురేఖ తెలంగాణ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలుస్తున్నారు. కొండా సురేఖ 1995 నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఆ కాలంలో కాంగ్రెస్‌ నుంచి వంచనగిరి ఎంపీటీసీగా విజయం సాధించారు. ఆపై గీసుగొండ మండల ఎంపీపీగా నియమితులయ్యారు. ఆ విధంగా ఆమె పొలిటికల్ లైఫ్ ప్రారంభమైంది. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన కొండా సురేఖ 15 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. కొండా సురేఖ ప్రజల్లో ఎల్లప్పుడూ మమేకమవుతుంటారు.

అయితే ఆమె ఎప్పుడు చూసినా రెడ్ కలర్ చీరకట్టులోనే కనిపిస్తారు. రెడ్ కలర్ అనేది శక్తికి, సామర్థ్యానికి చిహ్నం. అందుకే ఆ కలర్ చీరలో ఆమె ప్రజలను ఆదుకునే ఒక అపర పరాశక్తిగా కనిపిస్తుంటారు. ఆమె మాట్లాడే మాటలు కూడా తూటాల్లాగా ఉంటాయి. తెలంగాణ లేడీ పొలిటిషియన్లలో అసలైన ఫైర్ బ్రాండ్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా కొండా సురేఖ ధైర్యంగానే మాట్లాడేవారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైకో అంటూ సంచలన కామెంట్స్‌ కూడా చేశారు.

ఎప్పుడూ భయపడని నైజం ఆమెది. ఒక శివంగిలాగా విరుచుకుపడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తుంటారు. నఈమె మాట్లాడే తీరు, నడిచే నడక అన్నీ కూడా చాలా కాన్ఫిడెన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. వైయస్సార్ హయాంలో ఈమెకు రాజ భోగాలు లభించాయి. మంత్రిగా విధులు నిర్వర్తిస్తూ ఒక చక్రం తిప్పారు. దాని తర్వాత జగన్ రావడం వల్ల ఆమె ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇలా ఎవరికైనా సరే సరైన సమాధానం చెప్పగల ఏకైక లేడీ పొలిటిషియన్ కొండా సురేఖ అని చెప్పుకోవచ్చు. ఈమె రాజకీయాల్లో ఆడ సింహంలా ఉంటారు. ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం మంచి తల్లి లాగా మారతారు. ఆమె కూతుర్ల కాళ్ల కూడా ఒత్తుతూ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు తల్లి లాగా, మరోవైపు మంచి రాజకీయరాలుగా ఆమె కొనసాగుతూ చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: