* ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.5 టీయంసీనే
* ప్రజా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సిందే..!
(అమరావతి-ఇండియా హెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్లో ప్రజల తాగు మరియు సాగు నీటి అవసరాలు తీర్చడానికి అనేక ప్రాజెక్ట్లు ఉన్నాయి వాటిలో ఒకటైన ప్రాజెక్ట్ పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్.కె ఎల్ రావు సాగర్ కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద నిర్మించిన సేద్యపు నీటి ప్రాజెక్టు. దీనిని గతంలో పులిచింతల ప్రాజెక్టు అని పిలిచేవారు, ప్రముఖ ఇంజనీరు, రాజకీయనాయకుడు కె.ఎల్.రావు పేరుతో కె ఎల్ రావు సాగర్ అని అధికారిక పేరుపెట్టారు. విజయవాడ వద్దగల ప్రకాశం బారేజికి ఎగువన 85 కి.మీ.ల దూరంలో ఈ ప్రాజెక్టు స్థలం ఉంది. ఈ ఆనకట్ట స్థలం నదికి కుడివైపున పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద, ఎడమ వైపున సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం వజినేపల్లి వద్ద ఉంది.కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు వలన వీలవుతుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజీ కెపాసిటీ 36.23 టీఎంసీలు. డ్యామ్ వద్ద 3.61 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. డిసెంబర్ 7, 2013 న జాతికి అంకితమైంది.