తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఆయన బృందం అమెరికా బయలుదేరుతుంది. ఈ పర్యటనలో పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై చర్చించనున్నారు. డల్లాస్, ఇతర రాష్ట్రాల్లో పర్యటన జరుగుతుంది. ఆగస్టు 11న రేవంత్‌రెడ్డి అమెరికా నుంచి తిరిగి రానున్నారు.

2023 ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లతో బీఆర్‌ఎస్‌ కు పోటీ ఇచ్చింది. కానీ ghmc ఏరియాలో పట్టణ జనాభా ఓట్లు పొందలేక ఇబ్బంది పడింది. పట్టణ ప్రజలు తమకు ఓటు వేయకపోవడంతో ghmc ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీఆర్‌ఎస్‌ కు  రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సపోర్ట్ అంతంత మాత్రమే ఉన్నా భాగ్య నగరంలో మాత్రం బలమైన మద్దతు ఉంది. అందుకే అక్కడి ప్రజల ఓట్లను పెద్ద ఎత్తున పొందగలిగింది.

గత తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు కేటీఆర్ చాలా కృషి చేశారు. అందువల్లే పట్టణ ఓటర్లు బీఆర్‌ఎస్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గ్రామీణ జనాభాపై దృష్టి సారించారు, అయితే తన అమెరికా పర్యటనలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టగలిగితే ఈ పర్యటన పట్టణ ఓటర్లలో మంచి పేరు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది. దీని ఫలితంగా స్థానిక ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ అసలు సిసలైన పరీక్షలు ఓడిపోయి అతని పాలన పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను తీసుకురాగల సత్తా గల ముఖ్యమంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి వల్ల కాకపోతే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు రేవంత్ రెడ్డి చేయలేని పనిని చంద్రబాబు నాయుడు చేయగలిగారని చెబుతూ వ్యతిరేకత వచ్చేలాగా చేస్తారు. అందుకే రేవంత్ రెడ్డి ఈ పరిస్థితికి సిద్ధం కావాలి. అదృష్టవశాత్తూ, హైదరాబాద్‌లో ఇప్పటికే పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఉంది, ఇది అతని పనిని సులభతరం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: