గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి, వైసిపి నేత విజయ సాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని ఆమె మాజీ భర్త మదన్మోహన్ పలు రకాల ఆరోపణలు చేశారు... ఈ ఆరోపణలపై అటు శాంతితోపాటు విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ కావడం మరొకపక్క శాంతి భర్త మదన్మోహన్ కూడా వరుసగా ప్రెస్మీట్లో పెట్టి మరి డిఎన్ఏ టెస్టులకు సైతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే విజయ్ సాయి రెడ్డి ఆ బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సాయిరెడ్డికి తప్పు లేదని తెలిస్తే అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెబుతానట్టు తెలిపారు. అంతేకాకుండా శాంతి తనకు రెండో వివాహం సుభాష్ అనే వ్యక్తితో చేసుకున్నానని అతనితోనే కొడుకును కన్నానని తెలిపింది.


ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారాన్ని రేపింది ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరొకసారి స్పందించారు..విజయసాయిరెడ్డి శాంతి మదన్మోహన్ వ్యవహారంపై చర్చలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ కొన్ని టీవీ ఛానళ్లు కూడా చలామణి అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే శాంతి కలింగిరిని 2020 వ సంవత్సరంలో ఏసి ఎండోమెంట్స్ అధికారిగా వైజాగ్ ఆఫీసులో మొట్టమొదటిసారి ఆమెను కలిశాను.. అలా ఆమెను కలిసినప్పటి నుంచి కూతురుగానే భావించాను అంటూ విజయ్ సాయి రెడ్డి తెలిపారు.

ఆ సమయంలోనే ఒక తండ్రిలాగే ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని చెప్పి తెలిపానని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెకు కొడుకు కూడా పుట్టాడని చెబితే వెళ్లి పరామర్శించినట్లుగా కూడా తెలియజేశారు.. అలాగే తాడేపల్లి ఇంటికి తీసుకువచ్చి మరి ఆమెను ఆశీర్వదించినట్లుగా కూడా తెలియజేశారు.. ఈ సమయంలోనే తనకు ఏ పరాయి మహిళతోనైనా అనైతిక అక్రమ సంబంధాలు లేవంటూ విజయసాయిరెడ్డి తాను నమ్మిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేస్తానంటూ ఒక ట్విట్టును కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ  ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: