సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జగన్ ఢిల్లీ ధర్నా అంశాన్ని బాబు ప్రస్తావించారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో మనకు అనవసరమని.. ఆయన ఏం చేస్తారనేది మనకు ముఖ్యం కాదని.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనమేం చేయాలనేది ఇంపార్టెంట్ అని ఎంపీలకు తేల్చి చెప్పారు. జగన్ ధర్నా ఇష్యూను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాగా, జగన్ వ్యాఖ్యలను బాబు లైట్ తీసుకోవడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే,ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ సమాచారం కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం ఎలా అని జగన్ ప్లాన్స్ వేసుకోవడం ప్రారంభించారు. అందుకోసమే ఆయన వినుకొండ హత్యను వాడుకుంటున్నారు. శవరాజకీయాలు చేస్తూ ఆంధ్రలో లా అండ్ ఆర్డర్ కనుమరుగైందని, దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్తున్నారు. కానీ ఆయన అసలు ఉద్దేశం అసెంబ్లీకి డుమ్మా కొట్టడేమనని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడానికి జగన్ ఆడుతున్న కొత్త డ్రామానే ఢిల్లీలో ధర్నా అని చురకలంటించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జగన్ ఢిల్లీ ధర్నా అంశాన్ని బాబు ప్రస్తావించారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో మనకు అనవసరమని.. ఆయన ఏం చేస్తారనేది మనకు ముఖ్యం కాదని.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనమేం చేయాలనేది ఇంపార్టెంట్ అని ఎంపీలకు తేల్చి చెప్పారు. జగన్ ధర్నా ఇష్యూను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాగా, జగన్ వ్యాఖ్యలను బాబు లైట్ తీసుకోవడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే,ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ సమాచారం కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం ఎలా అని జగన్ ప్లాన్స్ వేసుకోవడం ప్రారంభించారు. అందుకోసమే ఆయన వినుకొండ హత్యను వాడుకుంటున్నారు. శవరాజకీయాలు చేస్తూ ఆంధ్రలో లా అండ్ ఆర్డర్ కనుమరుగైందని, దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్తున్నారు. కానీ ఆయన అసలు ఉద్దేశం అసెంబ్లీకి డుమ్మా కొట్టడేమనని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడానికి జగన్ ఆడుతున్న కొత్త డ్రామానే ఢిల్లీలో ధర్నా అని చురకలంటించారు.