వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈ రోజు(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. ఏపీలో కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని వైసీపీ వెల్లడించింది.వినుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని నిరసన తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తానని వెల్లడించారు.ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేయడానికి మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నాడని హోం మంత్రి అనిత ఆరోపించారు. ఈ రోజు మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ లో మీడియాతో అనిత మాట్లాడుతూ.. ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యల జరిగాయని అని జగన్ అంటున్నాడన్నారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉంటే ఆ డేటా ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాన్ని నిరూపించలేకపోతే జగన్ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు. వినుకొండలో వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను డైవర్ట్ చేసి రాజకీయాలకు అంటగడుతున్నారని ఫైర్ అయ్యారు. వినుకొండ లో పరామర్శించడానికి వెళ్లి అక్కడ రాజకీయాలు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. జగన్ కు సీఎం కుర్చీ పై వ్యామోహం ఇంకా తగ్గలేదన్నారు. ఎలాగైనా అడ్డదారిలో పీఠం ఎక్కాలని తహతలాడుతున్నాడని ఫైర్ అయ్యారు. అందుకే వినుకొండ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు.నిజంగా రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతుందని అనుకుంటే.. దమ్ముంటే అసెంబ్లీకి రా జగన్.. అంటూ సవాల్ విసిరారు. జగన్ అయినా, వేరే ఎవరు అయినా ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనకాడమని తేల్చి చెప్పారు. ఐదేళ్లలో గంజాయిని రాష్ట్ర పంటగా మార్చేశారని వైసీపీపై ఫైర్ అయ్యారు. ఇప్పుడు వాటన్నిటినీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: