ఏపీలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.  అనూహ్యంగా బయటకు వచ్చినటువంటి ఈమె వ్యవహారం చివరికి కోర్టుల దాకా వెళ్ళింది. అసలు శాంతి భర్త ఎవరు.. ప్రస్తుతం ఆమె ఎవరితో గర్భం దాల్చింది అనే విషయంలో ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ రావడం లేదు.  దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజలందరికీ ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే శాంతి భర్త మదన్మోహన్  శాంతి గర్భానికి నేను కారణం కానని, ఆమె విజయసాయిరెడ్డి తో ఉంటూ గర్భం దాల్చిందని సంచలమైన కామెంట్స్ చేశారు. దీనిపై వెంటనే స్పందించినటువంటి శాంతి, నా గర్భానికి విజయసాయి రెడ్డి అస్సలు కారణం కాదు.  అంత పెద్ద ఆయనపై అబాండాలు వేయడం మంచిది కాదంటూ ఖండించింది. 

కనుక గిరిజన  కులానికి చెందిన నన్ను ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడడం ఏ మాత్రం మంచిది కాదని అన్నది. రెడ్డి,రావుల పిల్లలను అయితే ఇలాగే అంటారా.. గిరిజన మహిళలు మంచి బట్టలు మంచి ఉద్యోగాలు చేయకూడదా అంటూ మాట్లాడింది. నా గర్భానికి నా రెండవ భర్త సుభాష్ కారణమని,నేను నా మొదటి భర్త మదన్ మోహన్ కి ఎప్పుడో వినాకులు ఇచ్చాను అని చెప్పుకొచ్చింది. ఇదే తరుణంలో విజయసాయి రెడ్డి కూడా స్పందిస్తూ.. కావాలనే కొంతమంది నాపై బురద జల్లుతున్నారని, ఒక మహిళ గౌరవాన్ని కించపరుస్తున్నారని,ఆమె నాకు ఒక బిడ్డ లాంటిదని చెప్పుకొచ్చారు.

మళ్లీ ఇదే విషయమై మదన్మోహన్ స్పందించి  శాంతి భర్త సుభాష్ కూడా ఆ గర్భానికి  కారకుడు కాడని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడని చెప్పాడు. ఇలా శాంతి వ్యవహారం రోజు రోజుకి చాలా కీలకంగా మారింది. ఇదే విషయమై  దేవాదాయ శాఖ సీరియస్ అయింది. శాంతికి నోటీసులు పంపి  మీ అసలు భర్త ఎవరో వివరణ ఇవ్వండి అంటూ తెలియజేసింది. మీరు ఉద్యోగంలో చేరినప్పుడు మీ భర్త పేరు మదన్మోహన్ ఇటీవల ప్రెస్ మీట్ లో సుభాష్ అన్నారు.  ఇది మీ ఉద్యోగ ప్రవర్తన నియమావళీకి విరుద్ధం అని నోటీసులో పేర్కొన్నది. అసలు భర్త ఎవరో చెప్పి క్లారిటీ ఇవ్వండి అంటూ నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై శాంతి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: