దేశ వ్యాప్తంగా అందరూ ఆసియా అపర కుబేరుడు అంబానీ కొడుకు అనంత్‌ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ, నీత దంపతుల చిన్న కుమారుడు అనంత్ - ప్రముఖ ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్ శైల మర్చంట్ల కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహం ఇటీవలే జరిగింది. గత శుక్రవారం రాత్రి ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వివాహ వేడుకకు దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ, తదితర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అదేవిధంగా బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో, హీరోయిన్స్ చాలామంది ఈ వేడుకలలో కనిపించి అలరించారు.


కొందరు సినీ ప్రముఖులు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వేడుకలతో అంబానీ కుటుంబం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ వివాహ వేడుక కోసం అంబానీ కుటుంబం దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఈ కల్యాణానికి వేదికగా నిలిచింది. ఈ వివాహానికి హాజరైన తన ఆత్మీయులకు అనంత్ అంబానీ అత్యంత ఖరీదైన వాచీలను కానుకగా అందజేసినట్లు సమాచారం. ఈ వాచ్ ల ధర సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా.

అంబానీ ఇంట జరిగిన ఈ వేడుకతో ఇప్పుడు వారి వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన కార్లు, ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. అయితే పెళ్లికి ముందే అనంత్ అంబానీకి ముఖేష్ అంబానీ దుబాయిలో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చిన విషయం మీకు తెలుసా..? ఈ అతి సుందరమైన ఇంటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ అనంత్ కోసం 2022 ఏప్రిల్ లోనే దుబాయిలో అత్యంత ప్రత్యేకమైన పరిసరాలలో ఒకటైన పామ్ జుమేరాలో విశాలమైన బీచ్ సైడ్ విల్లాను కొనుగోలు చేశారు.

3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విల్లాలో పది బెడ్ రూమ్ లు, 70 మీటర్ల  ప్రైవేట్ బీచ్ ని కలిగి ఉంది. అంతేకాదు ఇది దుబాయ్ లోనే రెండవ అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఈ విల్లాని ముఖేష్ అంబానీ రూ. 640 కోట్లతో  కొనుగోలు చేసి అనంత్ అంబానికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు అనంత్ అంబానీ హనీమూన్ కూడా ఇక్కడే ఎంజాయ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ విల్లా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: