వికసిత్‌ భారత్‌ ధ్యేయంగా పనిచేస్తున్న మోడీ సర్కార్‌.. ఇవాళ్టి యూనియన్‌ బడ్జెట్‌లో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించబోతోంది అని సామాన్య జనాలనుండి చదువరుల వరకు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లోక్‌సభలో దాదాపు 11 గంటలకు స్టార్ట్ అయిన బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది. మోదీ సర్కార్ ముచ్చటగా 3వ సారి కొలువు తీరిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశం ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని కీలక ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే... కొన్ని సెక్టార్‌లకు భారీ కేటాయింపులు చేయడం జరిగింది.

దేశానికి పల్లెలు పట్టు కొమ్మలు వంటివి. ఇందులో భాగంగానే మోడీ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఇది శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం అనేది ఎల్లపుడూ తోడుగా ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలు ఏర్పాటుకి శ్రీకారం చుట్టబోతున్నట్టు పేర్కొన్నారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి "పూర్వోదయ పథకం" అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అన్ని విధాలా సాయం చేయబోతున్నట్టు ప్రకటించారు.

మరీ ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడింది. ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-వోచర్లను అందజేయడం ద్వారా మొత్తం రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా అమృత్‌సర్ - కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పాటు కల్పించనున్నారు. రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగుల క్షేమమే ధ్యేయంగా ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసుకున్న మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద ఒక నెల జీతంలో రూ. 15,000 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: