ఈసారి కేంద్ర బడ్జెట్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. అవును, తాజాగా పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో వెనకబడిన పలు రాష్ట్రాల వారికి వరాల జల్లులు కురిపించారు. కేంద్రం ఈసారి ఆయా రాష్ట్రాలకు భారీ సాయాలు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో అమరావతి రాజధానితో పాటు, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘర్ మొదలగు ప్రాంతాల వారికి భారీ పేకేజెస్ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీకి వెనుకబడిన జార్ఖండ్ తో సమానంగా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. దాంతో చాలా కాలం తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఏపీకి చాలా స్పష్టంగా ప్రాధ్యాన్యత ఇవ్వబడింది అనేది స్పష్టం అయిందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

లోక్‌సభలో దాదాపు 11 గంటలకు స్టార్ట్ అయిన బడ్జెట్ ప్రసంగం నేటికీ కొనసాగుతోంది. మోదీ సర్కార్ ముచ్చటగా 3వ సారి కొలువు తీరిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశం ఇదే. ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని కీలక ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే... కొన్ని సెక్టార్‌లకు భారీ కేటాయింపులు చేయడం జరిగింది ఈ బడ్జెట్లో. మొత్తం బడ్జెట్లో ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ఆణిముత్యంలాంటి ఓ ప్రకటన చేయడం జరిగింది. అదే... "రూ.5వేల భృతి." అవును, ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన ప్రతీ విద్యార్థికీ రూ. నెలవారీ భత్యం రూ. 5,000 ఇవ్వనున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. అయితే దీనికి అందరూ అర్హులేనా అంటే అది కష్టమే అని చెప్పుకోవాలి. ఇలాంటి వాటికి కొన్ని నియమ నిబంధనలు అనేవి తప్పని సరి.

వెనుక బడిన వర్గాల వారికి, ప్రతిభ ఉండి కూడా ఆర్ధికంగా చదువుకోలేని విద్యార్థులకు ఈ పధకం ఎంతగానో సహకరించనుంది. అదే విధంగా పేదవారికి పీఎం ఆవాస్ యోజన - అర్బన్ 2.0 కింద రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడితో.. దాదాపు కోటి కుటుంబాలకు పైగా ఇళ్లు కట్టించనున్నారు. అదేవిధంగా పలు పట్టణాల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ పథకం అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: