పార్లమెంట్లో వరుసగా 7వసారి బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అనేక కీలక అంశాలను వెల్లడించడం జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలైన మోదీ 3.0 బడ్జెట్‌ ప్రకటన ఇంకా కొనసాగుతోంది. మొత్తంగా రూ.32.07 లక్షల కోట్లతో మోదీ సర్కార్ ఈసారి కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే పసిడి, వెండి కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీని భారీగా తగ్గించడం జరిగింది. బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గించగా... ప్లాటినమ్‌పై 6.4 శాతానికి కుదించినట్లు నిర్మల సీతారామన్ వెల్లడించారు. అదేవిధంగా మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను కూడా తక్కువ ధరకు అందజేస్తామని నిర్మలా ప్రకటించారు. అదేవిధంగా తోలు, మరియు సంబంధిత ముడిసరుకుతో చేసిన వస్తువులు కూడా ఇకనుండి తక్కువ ధరకే లభించనున్నాయి.

అదేవిధంగా 3 క్యాన్సర్ మందులను కస్టమ్ డ్యూటీ ఫ్రీగా మార్చడం జరిగింది. దీనిద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. వీటిపై జీఎస్టీ తొలగించడంతో ఈ మందులు తక్కువ ధరకే లభిస్తాయి. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటిని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించగా దేశవ్యాప్తంగా త్వరలో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. అదేవిధంగా పలు రకాల మెడిసిన్, వైద్య పరికారాలకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ బడ్జెట్‌లో కేంద్రం మహిళలకు, బాలికలకు పెద్దపీట వేసింది. వీరికి లబ్ధి చేకూరేలా ప్రతి ఏటా ఏకంగా రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

వర్కింగ్ మహిళల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం సొంతంగా హాస్టళ్లను ఏర్పాటు చేయనుందని మంత్రి తెలిపారు. ఉపాధి, నైపుణ్యం, MSMEలు (మైక్రో, స్మాల్ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్)తో పాటు మధ్యతరగతి వంటి నాలుగు ప్రధాన రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దేశంలోని దాదాపు 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చేలా రానున్న రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల నిధులను కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే దాదాపు 30 లక్షల మంది యువతకు ఒక నెల ప్రావిడెంట్ ఫండ్ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గనుంది. అంతేకాకుండా 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీతో పాటు, సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: