గత కొద్దిరోజులుగా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణరావు మిస్సింగ్ వ్యవహారం కుటుంబ సభ్యులను అటు నేతలను ముప్పు తిప్పలు పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో ఎంపీడీవో గా పని చేస్తున్న వెంకటరమణారావు మహాదేవపురం కాలనీలో నివసిస్తూ ఉండేవారట .జూలై మూడవ తేదీన సెలవు పెట్టి తన సొంత ఊరికి వచ్చారట. అలా 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను మచిలీపట్నంలోనే ఉండాలని ఇంటికి రావడానికి చాలా సమయం పడుతుందని.. అలాగే తన పుట్టినరోజు అయిన 16వ తేదీన చావు రోజు అంటూ కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ రాత్రి సమయంలో తన కుమారుడికి ఒక మెసేజ్ పెట్టారట.


దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు  కూడా సూసైడ్ నోటును రాసి తన సెల్ ఫోన్ నుంచి కుటుంబానికి పంపించారట ఇందులో వైసీపీ ప్రభుత్వ మాజీ చీప్ ప్రసాదరాజు పైన తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్ రెడ్డప్ప చేసిన బెదిరింపులు తార లేకపోయారని తనకు న్యాయం చేయాలని కూడా అందులో రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న కుటుంబ సభ్యులు ఆందోళనతో పెనమలూరులో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఇన్ని రోజులు గాలించారు..


 కాన మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు విషాదం గా మారినట్టు తెలుస్తోంది. ఏలూరు కాలువలో ఆయన మృతదేహం లభించినట్లు సమాచారం మిస్సింగ్ అయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఈ మృతదేహాన్ని ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు  మిస్సింగ్ అయిన వ్యక్తి తిరిగి వస్తారని అనుకున్నప్పటికీ కానీ ఇలా శవంలాగా తిరిగి రావడంతో కన్నీరు మున్నేరు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: