ఆంధ్రప్రదేశ్లో గత కొద్దిరోజులుగా హత్య  రాజకీయాలు జరుగుతున్నాయంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అలాగే ఢిల్లీలో వెళ్లి కూడా ధర్నా చేస్తున్నామంటూ ఇటీవలే ప్రకటించారు. దీంతో చాలా మంది నేతలు కూడా అసహనాన్ని కూటమి ప్రభుత్వం పైన తెలియజేస్తూ ఉన్నారు.. అయితే ఈ విషయం పైన అటు టిడిపి మంత్రులు మాత్రం అలా మరణించిన వారంతా కూడా టిడిపి కార్యకర్తలే కేవలం ఒక వైసీపీ కార్యకర్త మాత్రమే మరణించారు.ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మరణించారని ఒక లిస్టును కూడా విడుదల చేశారు.


అయితే ఇప్పుడు తాజాగా టిడిపి నేత మంత్రి లోకేష్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు వైసీపీ రాజ్యసభ నేత విజయసాయిరెడ్డి.. టిడిపి వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైసిపి వాళ్లను హతమారుస్తూ ఉంటే వీటిని మాట్లాడకుండా కేవలం హంతకులు కూడా వైసిపి వాళ్ళే అన్నట్లుగా సృష్టిస్తున్నారు. ఏ పార్టీ వాళ్లయినా హత్యల్ని ఎవరు సమర్థిస్తారు.. ఈ  రెడ్ బుక్ తో ఎంత కాలం ఈ రావణ దహనం అంటూ లోకేష్ పైన విజయసాయిరెడ్డి ప్రశ్నించారు..


అంతు చూస్తా పాదాలతో తొక్కేస్తా అంటే ఏంటో అనుకున్నాను ఇలా రాజకీయ కక్ష అనుకున్నామని తెలిపారు నిజంగానే ప్రభుత్వం ఇంతటి హీనంకు దిగజారి పోతుందని ఎప్పుడూ అనుకోలేదు హోం మంత్రి తుపాకీ పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది అంటు చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.. ప్రజలే కాదు పోలీసు యంత్రాంగం కూడా మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోతోంది అంటూ ఈ టిడిపి హత్య రాజకీయాలను ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ట్విట్ అయితే వైరల్ గా మారుతున్నది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ హత్యా రాజకీయాలు ఎప్పుడు పుల్ స్టాప్ పడతాయో చూడాలి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా శరవేగంగానే జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: