మంది నేతలపైన కార్యకర్తల పైన పలు రకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అసెంబ్లీ బయట నినాదాలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఢిల్లీకి వెళ్లి మరి ధర్నా చేస్తానంటూ కూడా తెలియజేశారు.. దీంతో చాలామంది వైసిపి నేతలు కార్యకర్తలు సైతం ఆందోళన చెందుతూ ఉన్నారు. కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా తాను వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తానంటూ తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి.


అయినా కూడా ఇలాంటి ఆగడాలు ఆంధ్రాలో ఆగడం లేదు.. ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లాలో టిడిపి నాయకులు మళ్ళీ బరితెగించినట్లుగా తెలుస్తోంది.వైసీపీ నేత క్రోనూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబి రెడ్డి పైన.. 15 మంది టిడిపి నాయకులు మాస్కులు వేసుకొని మరి ఆయన వెళ్లే దారిలో కాచుకొని మరి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మంగళవారం రోజున సాయంత్రం గుంటూరు నుంచి తాళ్లూరుకు వెళ్తూ ఉండగా ఉంగుటూరు వద్ద మాటు వేసి మరి టిడిపి నాయకులు సాంబి రెడ్డి కారు పైన దాడి చేసినట్లుగా తెలుస్తోంది.

దీంతో టిడిపి నేతల దాడిలో కారు ద్వంశమైనప్పటికీ సాంబిరెడ్డి కాళ్లు చేతుల పైన ఇనుప రాడ్లతో చాలా విచక్షణ రహితంగా కొట్టినట్లుగా కొన్ని వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ దాడిలో సాంబిరెడ్డి తీవ్రంగా గాయాల పాలయ్యారు. చికిత్స కోసం ఆయనను గుంటూరులోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కి తరలించినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో హుటాహుటిగా బయలుదేరి హాస్పిటల్ కి వెళ్లినట్లు వార్త వినిపిస్తున్నాయి..ఇప్పటికే ఆంధ్రలో హత్య రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అనే విధంగా వార్త వినిపిస్తున్నాయి.ఇలాంటి తరుణంలో మళ్లీ ఇప్పుడు వైసిపి నేతల పైన ఇలాంటి దాడులు చేయడంతో ప్రజలు కూడా కాస్త భయపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: