* శ్వేత పత్రాల పేరుతో కాలం గడిపిన బాబు
* ఆగస్టు, సెప్టెంబర్ లో ఏపీకి గడ్డుకాలం
* కేంద్రం సహాయం తీసుకోవాల్సిందే
* కొత్తగా అప్పు తీసుకోవాల్సిందే..



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. పూర్తిస్థాయిలో బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితి నెలకొన్నాయి. జగన్ దిగిపోయాక చంద్రబాబు ఏదో చేస్తారనుకుంటే ఆయన కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నారు. నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. శుక్రవారం రోజు అసెంబ్లీ సమావేశాలు ముగించేసి... నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు.

 

అయితే ఎన్నికల కంటే ముందు చెప్పిన సూపర్ సిక్స్  పథకాలకు నిధులు కేటాయించినట్లు ఎక్కడ కనిపించలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో... ఏ శాఖకు ఎంత  కేటాయించారు అనేది తెలియదు. వచ్చిన డబ్బులను.. వచ్చినట్లుగా ఏదో ఒక అవసరానికి వాడేయొచ్చు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పెట్టిన ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌తోనే ప్ర‌భుత్వం న‌డుస్తోంది. ఈ నెల 31తో అది ముగిసిపోతుంది. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు, సెప్టెంబ‌రు నెల‌ల‌కు మ‌రోసారి ఏం చేస్తారు?  ప్ర‌స్తుతం ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. అంటే.. ఎలాంటి చ‌ర్చ‌లు ఉండ‌వు. కేవ‌లం అంకెలు పేర్కొని గ‌వ‌ర్న‌ర్‌తో ఆమోదం పొందుతారు.


అయితే ఒకవేళ ఏదైనా ఒక శాఖకు డబ్బులు... అత్యవసరం అయితే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీ అప్పులు ఎన్ని ఉన్నాయి...? జగన్ ఎంత మేరకు చేశాడు ? ఉన్న బడ్జెట్ను ఏ పథకాలకు అమలు చేస్తాం ? అనే వివరాలను చంద్రబాబు ఈ అసెంబ్లీ సమావేశాలలో చెప్పక ఎస్కేప్ అయ్యారు.

ఆగస్టు అలాగే సెప్టెంబర్ నెలలో... బడ్జెట్ ఉండదు కనుక... కేంద్రాన్ని వెళ్లి అడిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమేర సహాయం చేయాలని చంద్రబాబు కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే... ఆ రెండు నెలల పాటు అప్పులు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు ఆ దిశగా కూడా అడుగులు వేస్తారు. మళ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే వరకు.. ఇలాగే పబ్బం గడిపే ఛాన్సులు ఉంటాయి. ఏది ఏమైనా నష్టపోయేది మాత్రం ఏపీ ప్రజలు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: