జనసేన ఎంపీ గెలుపు వెనక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉండటం ఏంటి ? ఆ ఆ టాప్ సీక్రెట్ ఏంటి ? అసలు ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎంపీ గెలుపునకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటి ? అనుకుంటున్నారా అయితే కచ్చితంగా ఈ స్టోరీ చదవాల్సిందే. అసలు విషయంలోకి వెళితే గత డిసెంబర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అప్పటివరకు మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరికీ ఘనంగా విందు ఇచ్చారు.. అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను ఆయన విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అప్పుడు మచిలీపట్నం నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి కూడా ఈ విందుకు వెళ్లారు.


అయితే బాలశౌరి వైసిపి ఎంపీలకు కూడా కొందరికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి కదా ఏదైనా పని ఉంటుంది మనకు వెళదామని పురమాయించారు. ఈ విషయం తెలిసిన జగన్ బాలశౌరిపై ఆగ్రహంతో ఊగిపోయారు. రేవంత్ రెడ్డి పిలిస్తే విందుకు ఎందుకు వెళ్లావు .. పైగా పార్టీ ఎంపీలను కూడా రమ్మని తీసుకువెళతావా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసారట. ఇది కొందరు పార్టీ నేతలు సమక్షంలోనే జరిగింది. జగన్ అన్న మాటలకు బాలశౌరి తీవ్రంగా హర్ట్ అయ్యారు. అప్పుడే అయినా పార్టీలో ఉండటం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చేసారు.


ఈ క్రమంలోనే రెండు మూడు నెలల పాటు అవమానంతోనే పార్టీలో ఉన్న బాలశౌరి కచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లిపోయారు.. జనసేన నుంచి అదే బందరు ఎంపీ సీటు తెచ్చుకొని ఘనవిజయం సాధించారు. అలా రేవంత్ రెడ్డి విందుకు ఆహ్వానించకపోతే జగన్ బాలశౌరిని తిట్టి ఉండే వారే కాదు.. బాలశౌరి పార్టీ మారకుండా అదే వైసీపీ నుంచి మళ్లీ బందరులోనే పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయి ఉండేవారేమో..! అలా పరోక్షంగా రేవంత్ రెడ్డి బాలశౌరి జనసేనలోకి వెళ్ళటానికి ఆయన రెండోసారి ఎంపీగా గెలవడానికి కారణమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: