టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరిజగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ బద్రి. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా అలాగే రేణుదేశాయ్ హీరోయిన్గా చేశారు.అక్కడ వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్ళింది.కారణం తెలియదు కానీ రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు.ఆమె పవన్‌తో విడాకులు తీసుకుని చాలాకాలం అయినప్పటికి తెలుగు ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యక స్థానం ఉంది.అనంతరం రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆద్యలతో పూణే వెళ్లిపోయారు. ఆమె అక్కడే ఉండేవారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పిల్లలను కలిసేందుకు పూణే వెళ్లేవారు. విడాకులు తీసుకున్నప్పటికీ రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం కొనసాగుతుంది. పిల్లల కోసం తరచుగా కలుస్తూ ఉంటారు. అకీరా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం కి పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ కలిసి హాజరయ్యారు.పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వా రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. రేణు దేశాయ్‌ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది.రవితేజ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు లో ఓ కీలక రోల్ చేసింది.అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవాలని ప్రకటించినప్పటికి, పవన్ అభిమానుల విమర్శలకు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఈ సమయంలో ఆమె పవన్ కల్యాణ్ నుంచి తీవ్ర ట్రోలింగ్‌కు కూడా ఎదురైంది.

రేణు దేశాయ్ కి డైరెక్షన్ చేయాలనే కోరిక కూడా ఉంది. తన వద్ద కొన్ని కథలు ఉన్నాయని, వాటిని తెరకెక్కిస్తానని రేణు దేశాయ్ గతంలో చెప్పారు. కాగా రేణు దేశాయ్ సామాజిక, ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. రేణు దేశాయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవనున్నారట. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడాకులు తీసుకుని చాలా ఏళ్ళు అవుతుంది. అధికారికంగా వారు కలిసింది లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని రేణు దేశాయ్ కలుస్తున్నారన్న వార్త సంచలనం రేపుతోంది.భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్‌కు చీఫ్ అడ్వైజర్‌గా రేణు దేశాయ్ కొనసాగుతున్నారు. ఈక్రమంలోనే రేణు దేశాయ్ తెలంగాణ అటవీ, పర్యావరణ , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖతో భేటీ అయ్యారు.ఈ క్రమంలోనే వచ్చే వారం ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశమున్నట్లు సమాచారం.ఆనంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కూడా ఆమె భేటీ కానున్నారనే వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరమని, దీని గురించి వివరించి యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రులతో రేణు దేశాయ్ చర్చించనున్నారు. విడాకులు తర్వాత తొలిసారి ఇలా అఫీషియల్‌గా పవన్‌ను రేణుదేశాయ్ కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: