ముఖ్యంగా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారికే పట్టం కడతారని కూడా ఎన్నోసార్లు రుజువయింది. వైసీపీ పార్టీ ఈ సారి కేవలం 11 సీట్లకు పడిపోవడంతో ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనే విధంగా ఫలితాల తర్వాత కూటమినేతలు చాలా సంబరపడ్డారు.. కానీ ఎప్పుడైతే చంద్రబాబు పాలన మొదలైందో ఆ క్షణం నుంచే అధికార పార్టీకి కాస్త ఆయుష్షు తగ్గడం కూడా ప్రారంభమయ్యింది. ప్రజలు ఆదరించకపోతే ఏ పార్టీ అయినా కూడా కనుమరుగవుతుందని చెప్పవచ్చు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ని రాజకీయంగా నాశనం చేయాలని చూసినప్పటికీ అది సాధ్యం కావడం లేదు. ఇలా చేయాలనుకున్న ప్రతిసారి కూడా కూటమి అబాసపాలవుతోంది.
అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయాలని చూసినప్పటికీ అది చూస్తే భయమేస్తోంది అంటూ చంద్రబాబు చెప్పిన తీరు అటు కూటమి సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టే అవకాశం ఉందనే విధంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇది కూటమి వ్యతిరేక రావడానికి కూడా మారిపోతుంది.. అంతేకాకుండా గత పాలనలో సంక్షేమ పథకాలు క్యాలెండర్ ద్వారా విడుదల చేసి మరి ఆ డబ్బులను ప్రజల అకౌంట్లో జమ చేసేవారు జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తానని అది కూడా సంపాదన సృష్టించి ఇస్తానని హామీ ఇవ్వడం వల్లే ప్రజలు ఓటు వేయగా ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి బాగోలేదంటూ చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి ఇలాంటి పరిస్థితులలో కచ్చితంగా జగన్ చూస్తే టిడిపికి భయం వేస్తుంది. ఇప్పటికే చాలా సందర్భాలలో టిడిపి నేతలు కూడా ట్రోల్ కి గురవుతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ రాజకీయంగా ఎదవనీయకుండా చేయాలని చూస్తున్నాప్పటికీ అది సాధ్యపడలేదు.