కచ్చితంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాల్సిందే అని పలువురు ప్రజలు కూడా పట్టుబడుతున్నారు. గతంలో మీడియా మీటింగ్ లో సూపర్ సిక్స్ హామీల విషయంలో చాలామంది టిడిపి నేతలు కూడా ఊదరగొట్టారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని కేవలం సూపర్ 3 పథకాలను మాత్రమే అమలుచేయడం ఏపీ సీఎం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 1). పింఛన్ పెంచడం 2).రెండోది తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 1500 చొప్పున ఇవ్వడం..3). నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇవ్వడం..4). 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 నెల నెల ఇవ్వడం 5). ఉచితంగా మహిళలకు ఆర్టీసీ ప్రయాణం.6). రైతు భరోసా కింద 20000 ఇవ్వడం.
అయితే ఇప్పుడు ఇందులో మూడు హామీలనే అమలు చేస్తున్నారు. అందులో ఒకటి పింఛన్ పెంపడం, మరొకటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అలాగే సూపర్ సిక్స్ లో లేని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం వంటివి చేయబోతున్నారట.. దీన్నిబట్టి చూస్తే సూపర్ సిక్స్ హామీ పథకాలు ఫెయిల్యూర్ అని సూపర్ 3 పథకాలు సక్సెస్ అని కూడా చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలకు తగ్గట్టుగానే ఏపీ సీఎం ప్లాన్ చేస్తారేమో చూడాలి మరి.