- చదువుకునే సమయంలోనే చిగురించిన ప్రేమ..
- చాటు మాటు చూపులు కలిసిన మనసులు..
- కొండ మురళి సురేఖ ప్రేమలో ఎన్నో మలుపులు..


 ఉమ్మడి వరంగల్ జిల్లాలో  కొండా మురళి కొండా సురేఖ దంపతులు అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో రాటు తేలిన ఈ ఇద్దరు భార్యాభర్తలు  జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. చివరికి అన్నింటిని అధిరోహించి  రాష్ట్రస్థాయిలో మంత్రి పీఠాన్ని చేపట్టగలిగారు. కొండా సురేఖ కొండా మురళి ప్రేమ వల్లే ఇంతటి స్థాయికి వచ్చానని ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. ఇలాంటి వీరి మధ్య పుట్టినటువంటి కాలేజీ ప్రేమ  ఎలా నడిచింది..వీరి మధ్య జరిగినటువంటి చిలిపి సన్నివేశాలు ఏంటి అనే వివరాలు చూద్దాం.

 కొండా మురళి సురేఖ :

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈమె  తిరుగులేని రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. అలాంటి కొండా మురళి సురేఖ ప్రేమలో ఎన్నో ఆటుపోట్లు చిలిపి పనులు ఉన్నాయి. కొండా సురేఖ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే కొండా మురళి ఆమెను వెంబడించేవారట. ప్రతిరోజు ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెనుక ఫాలో అవుతూ అలా చూస్తూ ఉండేవారట. కానీ సురేఖ కొన్నాళ్లపాటు కొండా మురళిని అస్సలు పట్టించుకునేది కాదట. దీనికి ప్రధాన కారణం కొండా సురేఖ బ్యాచ్ లో పది మందికి పైగా అమ్మాయిలు కలిసి వెళ్లేవారట. కానీ మురళి ఒక నలుగురి ఫ్రెండ్స్ తో కలిసివచ్చే వారట. కానీ ఆయన ఎవరిని వెంబడిస్తున్నారు అనేది అర్థం కాలేదట.అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత కొండా సురేఖ ఉండే ఇంటి వైపు కూడా మురళి తరచూ తన హెజ్డి బండి వేసుకొని వెళ్తూ అలా చూసేవారట. అలా ఇద్దరి మధ్య చూపులు చూపులు కలిసి చివరికి ప్రేమకు దారితీసిందట. అలా కొండా సురేఖ కాలేజ్ అయిపోయాక బస్సులో వెళుతుంటే ఆ బస్సు వెంబడించి కొండా మురళి ఫాలో అయ్యేవరట.  



ఒకరోజు ఉదయాన్నే కొండా సురేఖ కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యి బస్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కొండ మురళి ఒక శాలువా కప్పుకొని వచ్చి, సుబేదారి పోస్ట్ ఆఫీస్ వద్ద ఆగి  తన ఫోన్ నెంబర్ తీసుకోవాలని కొండా సురేఖకు చెప్పారట. చివరికి ఆమె ఒక నోట్ బుక్ ఓపెన్ చేసి చివరి పేజీలో తన నెంబర్ నోట్ చేసుకుందట. అలా ప్రతిరోజు కొండా మురళి ఆమెను ఫాలో అవుతూ ఒక రెండు రోజులు రాకపోయేసరికి సురేఖ ఆయన కోసం వెయిట్ చేసి చివరికి ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేసిందట. ఆ నెంబర్ ను కొండా మురళికి సంబంధించిన ఒక వ్యక్తి  లిఫ్ట్ చేయడంతో సురేఖ ఫోన్ చేసిందని చెప్పండి అని చెప్పిందట. అలా ఇద్దరి మధ్య లవ్ పుట్టింది. అలా ఒకరోజు నేరుగా కొండా మురళి  సురేఖ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి సురేఖను బయటికి రమ్మని ఒక అమ్మాయికి చెప్పి పంపారట.. వెంటనే సురేఖ తన ఇంట్లో నుంచి బయటకు వచ్చిందట. బండి మీదనే ఉన్నటువంటి మురళిని ఏంటి పిలిచారని అడిగిందట. వెంటనే కొండా మురళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా చెప్పారట. నా క్యాస్ట్ ఏంటో నీకు తెలుసా.. నన్ను మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని సురేఖ అడగగా..దాన్ని నేను పట్టించుకోను అని మురళి అన్నారట. అలా ఇద్దరు కలిసి తిరుపతిలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని అంచలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఇక వీరి లవ్ స్టోరీ ఎంతోమంది లవర్స్ కి ఇన్స్పిరేషన్ గా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: