గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాన నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కక్షపూరితంగానే ప్రదర్శిస్తున్నారంటూ ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి పలు వాక్యాలు చేశారు.. నిన్నటి రోజున రఘువీరా రెడ్డి మాట్లాడిన ఒక వీడియోను కూడా తన ట్విట్టర్ లో నుంచి పోస్ట్ షేర్ చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ఆగ్రనేతగా రాహుల్ గాంధీ అనేటువంటి ఒక నిప్పు కనికను సైతం తాకి మోదీ తన ఒళ్ళు కాల్చుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం వల్ల మరొకసారి బిజెపి పార్టీకి ఇబ్బందులు తప్పవు అంటూ తెలుపుతున్నారు.

ప్రజల తరపున తమ అధినేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని.. ప్రజలకు మేలు చేసే విధంగానే మోదీ ప్రభుత్వం పని చేయాలంటూ తెలియజేశారు. రాహుల్ గాంధీ అనే అగ్నిపర్వతాన్ని.. సిబిఐ, ఈడి అధికారులతో కక్షపూరితంగా తాకే ప్రయత్నం అయితే మళ్లీ చేస్తున్నారు. దీంతో కచ్చితంగా మసికాక తప్పదంటూ రఘువీరారెడ్డి హెచ్చరించడం జరిగింది మోడీని.. ఎక్కడ ఇబ్బందులు ఉంటే కచ్చితంగా అక్కడ రాహుల్ గాంధీ పర్యటిస్తూ ధైర్యాన్ని సైతం ఇస్తున్నారంటూ తెలిపారు.


మణిపూర్ లో రెండుసార్లు పర్యటించి అక్కడ బాధితులకు సైతం తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారనే విషయాన్ని కూడా రఘువీరారెడ్డి గుర్తు చేశారు.. అలాగే కేరళలోని వయనాడ్ లో వరదల బీభత్సరం గురించి చెప్పాల్సిన పనిలేదు అక్కడ కూడా రాహుల్ ప్రియాంక గాంధీ అక్కడ బాధితులను సైతం పరామర్శించి వారిలో ధైర్యాన్ని సైతం నింపేందుకే ప్రయత్నిస్తూ ఉన్నారని.. ఇలాంటి పని మోదీ ఒకతైన చేశారా అంటూ తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీని ఇబ్బంది పెడితే కచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్టుగానే ఉంటుంది అంటూ మోడీ పైన మాజీమంత్రి రఘువీరారెడ్డి విమర్శల సైతం చేస్తున్నారు. మరి వీటి పైన బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: