ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం ఇదే..ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హాజరయ్యారు.. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." ఏపీలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలి. దీనికి డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లో భారీఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దాం.ఫుడ్ హ్యాబిట్స్ మారుతుంటే ప్రోడెక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. 20లక్షల హెక్టారుల్లో 20లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం దిశగా ముందుకు వెళ్తున్నాం. హై ప్రోటీన్ ప్యాడీకి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వ్యవహరించాలి. ఎక్కడికక్కడ భూసార పరీక్షలు చేయాలి. ప్రతి రంగంలోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఫైబర్ నెట్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లారిటీ లేదు" అని చెప్పారు..ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌మాట్లాడుతూ.. చంద్రబాబు విజన్‌ను నిజం చేయడానికి కష్టపడటానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ''రాజ్యాంగాన్ని కాపాడటానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాధ్యక్షత, అనుభవం, దార్శనికతను నేర్చుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. రాజ్యాంగాన్ని కాపాడటంలో చంద్రబాబు మార్గదర్శకత్వం అందిస్తారని భావిస్తున్నాం. ఈ క్రమంలో మా తరపున ఏమైనా తప్పులు ఉంటే అధికారులు జంకకుండా వాటిని మాకు తెలియజేయాలి. వాటిని మేము తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రత్యేకించి మా మంత్రుల శాఖలో ఏవైనా లోపాలు కనిపస్తే మా దృష్టికి తీసుకురండి. వాటిని పరిష్కరిస్తాం'' అని అధికారులకు సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: